Free Drinking Water: మహారాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా, సురక్షితమైన తాగునీరు అందించడాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్డిఏ (FDA) కమిషనర్ తుకారాం ముండే ఆదేశాల ప్రకారం ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.
Free Drinking Water ప్రధాన విషయాలు:
- ప్రతి రెస్టారెంట్లో “ఉచితంగా సురక్షితమైన తాగునీరు లభిస్తుంది” అనే నోటీసు బోర్డును కస్టమర్లకు కనిపించేలా పెట్టాలి.
- కస్టమర్లను ఖరీదైన వాటర్ బాటిళ్లు మాత్రమే కొనాలని బలవంతం చేయడానికి ఇకపై వీల్లేదు.
- ఉచిత నీరు ఇవ్వకపోయినా, బోర్డులు పెట్టకపోయినా యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయి.
చాలాచోట్ల ఉచిత నీరు అడిగితే నాణ్యత లేని నీళ్లు ఇవ్వడం, లేదా నేరుగా వాటర్ బాటిళ్లు టేబుల్పై పెట్టి బిల్లు వేయడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి నిబంధనలే అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.